ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్త అంటూ తప్పుడు ప్రచారం

  • ఐప్యాక్ నుంచి వైదొలిగి, బీహార్ రాజకీయాల్లో బిజీబిజీగా ప్రశాంత్ కిషోర్
  • బీహార్‌లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదిక

2019 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వైయస్ జగన్‌ పార్టీకి కూడా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో బిజీబిజీ ఉన్నారు. రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారుండరు. ఐప్యాక్ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి రాజకీయ వ్యూహకర్తగా అనేక పార్టీలకు సేవలు అందించారు. ప్రధాని మోడీతో సహా కేజ్రీవాల్, మమతాబెనర్జీ, స్టాలిన్ కి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు.

కానీ గత ఏడాదికాలంగా ఆయన ఐప్యాక్ మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగి.. తన సొంత రాష్ట్రం అయిన బీహార్‌లో జనసురాజ్ పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. కొంతమంది టీమ్‌తో కలిసి రాజకీయాలపై ఆసక్తి గలిగిన యువతతో కలిసి ఆ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. బీహార్‌ రాజకీయ యవనికపై తనదైన ముద్రను లిఖించాలన్నదే ప్రశాంత్ కిషోర్ అంతిమ లక్ష్యం.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉన్న ఆయన తాను నెలకొల్పిన సంస్థ ఐప్యాక్ నుంచి వైదొలిగారు.

అయితే ప్రస్తుతం ఒక వార్త ఆంధ్ర లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే… ఏపీ రాజకీయాలపై మరోసారి పీకే దృష్టి పెట్ట‌బోతున్నార‌న్న‌ట. కానీ ఇది కేవలం ఒక వర్గం చేసుకుంటున్న ప్రచారం మాత్రమే. ప్రస్తుతం ఆయన లక్ష్యం బీహార్ పాలిటిక్స్ ఒక్కటే. అక్కడ తనదైన మార్క్ రాజకీయాలు చేసే పనిలో బిజీ గా ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన పీకేకు లేదన్నది అతని సహచరులు అంటున్నారు. కాబట్టి గతంలో తాను పనిచేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశమే లేదు. జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ఏ కారణం లేక
టీడీపీ అండ్ ఎల్లోమీడియా పీకే పేరును తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ సారథ్యంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ దశలో టీడీపీకి అనేక జిల్లాల్లో కనీసం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందట. ఈ నేపథ్యంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎలాంటి అంశం లేకపోవడంతో చంద్రబాబు అండ్ కో ప్రశాంత్ కిషోర్ పేరును తెరపైకి తెచ్చిందాని వైసీపీ వర్గం భావిస్తోంది. అసలు ఏ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని చంద్రబాబు వంటి నక్కజిత్తుల నాయకుడితో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారనుకోవడం ఒట్టి భ్రమేనని అనుకొంటున్నారు జనాలు.

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024