నటుడు సాయాజీ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నారు. మహారాష్ట్ర చెందిన షిండే తెలుగులోనే కాకుండా మరాఠీ, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ వంటి 4 భాషాల్లో నటించి మంచి ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ విషయం ఆయన ఫ్యాన్స్ను కలవరపెడుతోంది. అదేంటంటే సాయాజీ షిండే ఆసుపత్రి పాలయ్యారట.
విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే షిండేను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారట. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా… అయితే ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ అయ్యిందని పరీక్షల్లో తేలిందట. వైద్యులు ఆయనకు వెంటనే యాంజియోప్లాస్టీ సూచించారట. ప్రస్తుతం అయితే సాయాజీ షిండే ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. తొలుత సాయాజీ షిండే 2001లో టాలీవుడ్లోకి సూరి సినిమాతో అడుగు పెట్టారు. ఆ తరువాత వరుసబెట్టి సినిమా అవకాశాలు ఆయన తలుపుతట్టాయి. ముఖ్యంగా ఆయన యాక్సెంట్ తెలుగు ప్రజలకు విపరీతంగా నచ్చింది. దీంతో ఆయనకు టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ పథకాలన్నీ…
బుల్లితెరపై స్టైలిష్ యాంకర్గా మార్క్ క్రియేట్ చేసింది అనసూయ. అప్పటి వరకూ యాంకర్స్ అంటే నిండుగా బట్టలు ధరించి ఉండేవారు.…
యానిమల్ మూవీతో బాలీవుడ్లో జెండా పాతింది రష్మిక మందన్న. ఈ చిత్రం ఎంత పెద్ద సక్సస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన…
ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడి చచ్చిందన్నట్టుగా ఉంది టీడీపీ వైఖరి. ఊరందరికీ నీతులు చెప్పే ఈ…