రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వెల్లడించింది. బాలీవుడ్లో అవకాశాల మీద అవకాశాలు కొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రామ్ చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. చెర్రీ డ్యాన్స్కు తానొక పెద్ద ఫ్యాన్ అని వెల్లడించింది.
ఎప్పటి నుంచో తాను రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానని.. తన తదుపరి సినిమా పక్కాగా చెర్రీతోనే ఉండాలని కోరుకుంటున్నట్టు మానుషి చిల్లర్ తెలిపింది. ‘బడే మియా ఛోటే మియా’ సినిమాలో తనకంటే 30 ఏళ్లు పెద్ద వాడైన అక్షయ్ కుమార్తో ఈ ముద్దుగుమ్మ జత కట్టింది. ఈ సందర్భంగా ఈ విషయమై మాట్లాడుతూ.. వయసులో పెద్ద వారైనా స్టార్ హీరోలతో నటిస్తానని తెలిపింది.
స్టార్ హీరోలతో నటిస్తే ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు వీలుంటుందని మానుషి చిల్లర్ వెల్లడించింది. అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ అని ఆయనతో వర్క్ చేయడాన్ని తానెంతో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. అక్షయ్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కొందరికే వస్తుందని తెలిపింది. తమ చిత్రాల్లో ఎవరిని తీసుకోవాలనే దర్శకుల నిర్ణయమని.. కాబట్టి దాని గురించి తాను ఆలోచించబోనని తెలిపింది.
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్లో జరుగుతున్న…
ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్గా ఓ రేంజ్లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…
పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ ఎదిగాడు. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్లో టాలీవుడ్లో…
పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. గురించి తెలియని తెలుగు వారుండరు. సీతగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారి గుండెల్లో గొప్ప స్థానమే…