డీజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ నెల 8న జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నాడు. నిజానికి దీనికి సంబంధించి రెండు రోజుల క్రితమే టాక్ వచ్చింది. అదెలాగంటే.. ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం టిల్లు స్క్వేర్ సినిమా చూశాడట.
సినిమ హిట్ అవడంతో తన ఇంటికి సిద్దు జొన్నలగడ్డతో పాటు నిర్మాత నాగవంశీ, మరో యంగ్ హీరో విశ్వక్సేన్ని పిలిచి పార్టీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన పిక్స్ బయటకు రావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి సక్సెస్ మీట్కి ఎన్టీఆరే ముఖ్య అతిథి అంటూ టాక్ మొదలైంది. అదే నిజమైంది. టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది.
తొలి మూడు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ మూవీ కలెక్షన్లు రూ.50 కోట్లకు చేరుకుంది. తొలి వారంలో దాదాపు రూ.100 కోట్ల మార్కును అందుకుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి సక్సెస్ మీట్ని గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధుకి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. వీళ్లిద్దరి జంట వెండితెరను షేక్ చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో…
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…