తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతుంటడంతో విజయం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా కొందరు ఎవరికి నచ్చిన వారికి వారు మద్దతు ఇస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎక్కువ లోక్సభ సీట్లను కైవసం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ఈ స్థానం నుంచి ఎంఐఎం తరుఫున అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు.
అసదుద్దీన్ను ఎదుర్కొనేందుకు బీజేపీ మాధవీ లతను బరిలోకి దింపింది. మాధవీ లత చాలా యాక్టివ్గా జనాల్లోకి వెళుతున్నారు. ఒకవైపు ప్రచారం.. మరోవైపు ప్రెస్మీట్లతో ఎలక్షన్ హీట్ను పెంచేస్తున్నారు. ప్రస్తుతం మాధవీ లతకు రేణు దేశాయ్ సపోర్టుగా నిలిచారు. ఈ మేరకు ఇన్స్టాలో రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టారు. చాలా కాలం తర్వాత రాజకీయాల్లో ఒక బలమైన మహిళను చూశానని.. ఆమెకు తాను సపోర్టుగా నిలుస్తున్నట్టు తెలిపారు. తాను నిజాయితీగా ఫీలయ్యే ఈ పోస్ట్ పెట్టానని.. డబ్బు తీసుకుని కాదని మాధవీ లత వెల్లడించారు.
సచిన్ టెండూల్కర్ స్టేడియంలో పాక్ బౌలర్స్ను ఒకాట ఆడుకుంటే ఎలా ఉంటుంది? అసలు భారత్, పాక్ మ్యాచే హోరెత్తించేదైతే.. ఇక…
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఈసారి…
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది ఓపెన్ సీక్రెటే. ఎప్పటి నుంచో చాలా మంది నటీమణులు ఈ విషయాన్ని వెల్లడించారు.…
అవును.. తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగిపోయారు. తమ్ముడికి అవసరమైతే తప్పక సపోర్ట్ చేస్తానని గతంలో ఓ సందర్భంలో మెగాస్టార్…
ఇండస్ట్రీలో సక్సెస్ అయితే తప్ప గుర్తింపు రాదు. స్టార్ హీరో కొడుకైనా.. సామాన్యుడి కొడుకైనా అక్కడ ఒక్కటే. స్టార్ హీరో…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో ఓడిపోతామనే భయం కలిగిన పార్టీలు, నేతలు తమ…