పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ‘బ్రో ది అవతార్’. ఈ సినిమాను భీమ్లా నాయక్ తర్వాత దాదాపు ఏడాది కాలం పాటు గ్యాప్ తీసుకుని చేశారు. ఈ సినిమాలో వపన్తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ మల్టీ స్టార్ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. వీటికి ఫ్యాన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నేడు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక నేడు విడుదలైన పోస్టర్లో యి ధరమ్ తేజ్ చేతులు కట్టుకొని పవన్ కళ్యాణ్ వెనుక నిలబడగా,పవన్ కళ్యాణ్ స్టైల్ గా బైక్ మీద కాలు పెట్టుకుంటాడు. చూడగానే వావ్ అనిపించే ఈ పోస్టర్ పవన్ అభిమానులను మరింత ఆకట్టుకుంది.
ఇక జనాల కళ్లు ముందుగా పోస్టర్లోని పవన్ బూట్లపై పడింది. అవి తెలుపు, నలుపు రంగు బూట్లతో చాలా ఆకర్షణగా ఉన్నాయి. అవి చూసి ఫ్యాన్స్ ఆగుతారా? రేటు ఎంతో కనుక్కునేందుకు గూగుల్ను అడిగారు. ధర చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ బూట్ల ధర రూ.లక్ష పైమాటేనని.. మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ కంటే ఎక్కువ అంటూ పోస్టులు పెడుతున్నారు.
‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…
టిల్లు స్క్వేర్తో మళ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్బాస్ షో ఎవరికి…
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…