బిగ్బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపరీతమైన ప్రేక్షకాదరణ సాధించుకుని రేటింగ్స్లో దూసుకెళ్లింది. ఇక ఈ వేడి ప్రేక్షకుల్లో తగ్గకముందే బిగ్బాస్ సీజన్ 8ను ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ కోసం పరిశీలన చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కొందరిని సంప్రదించారని సమాచారం.
అయితే బిగ్బాస్ 8 గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..ఈ సీజన్లో పాత సీజన్కి సంబంధించిన ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయనున్నారట. బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం ముగ్గురు కంటెస్టెంట్స్. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే.. శివాజీ, అమర్దీప్, పల్లవి ప్రశాంత్.
సీజన్ 7లో ఈ ముగ్గురూ టాప్ 3 స్థానాలను దక్కించుకున్నారు. స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ గొడవలతో ఈ సీజన్ ఆసక్తికరంగా సాగింది. ఇప్పుడు ఈ టాప్ 3 కంటెస్టెంట్స్ ముగ్గురు తిరిగి 8వ సీజన్లోనూ సందడి చేయనున్నారని టాక్. ప్రస్తుతం అమర్దీప్ అయితే ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతోంది. మరి వీళ్లు తిరిగి సీజన్ 8లో కనిపిస్తారో లేదో చూడాలి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో…
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…