శృంగార తార అనగానే మనకు గుర్తొచ్చేది సన్నీలియోన్. ఈ బాలీవుడ్ భామ తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది. ‘ స్ప్లిట్స్ విల్లా’ అనే కార్యక్రమానికి సన్నీలియోన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. తాజాగా సన్నీలియోన్ ఈ షోలో తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. అదేంటంటే.. తన పెళ్లికి ముందు ఒక వ్యక్తిని సన్నీ డీప్గా లవ్ చేసిందట. అతను కూడా సన్నీని ఇష్టపడ్డాడట.
చాలా రోజుల పాటు కలిసి ఉన్న మీదట పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట. ఆ తరువాత తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా హవాయి దీవుల్లో చేసుకోవాలనుకున్నారట. అయితే ఎంగేజ్మెంట్ అయిన నాటి నుంచి అతని మార్పు మొదలైందట. అనుమానం వచ్చి నిలదీస్తే నీపై ప్రేమ ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాడట. ఆ మాటతో తను నిలువెల్లా వణికిపోయిందట. పెళ్లి కోసం బట్టలు, నగలు కూడా కొనుక్కుందట.
పెళ్లి కోసమని భారీగా డబ్బు ఖర్చు పెట్టి ఏర్పాట్లన్నీ చేసుకున్నారట. కేవలం పెళ్లి రెండు నెలలుందనగా.. ఆమె ప్రియుడు ఇలా బాంబ్ పేల్చాడట. ఆ సమయంలో సన్నీ లియోన్ బాధను తట్టుకోలేకపోయిందట. నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. దాని నుంచి బయటపడటం చాల కష్టమైపోయిందట. ఆ సమయంలోనే తనకు వెబర్ కనిపించాడని.. తనేంటో అతనికి తెలుసని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తన కష్టసుఖాల్లో వెబర్ తనకు తోడుగా ఉన్నాడని సన్నీలియోన్ వెల్లడించింది.
టిల్లు స్క్వేర్తో మళ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్బాస్ షో ఎవరికి…
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ పథకాలన్నీ…