కొన్ని దృశ్యాలు అరుదుగానే చూడగలం. ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి నెట్టింట వైరల్ అవుతూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇలాంటి రోజు ఒకటొస్తుందని.. ఇలాంటి సీన్ చూస్తామని కూడా అనుకోం. అలాంటి ఘటనే నేడు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో చోటు చేసుకుంది. ఈ దృశ్యం మెగా అభిమానులకైతే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ఆ దృశ్యం ఏంటంటారా?
ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఇది సర్వసాధారణమే కానీ మోదీ వేదికపై నుంచి దిగిపోయే క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయి పట్టుకుని చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఒకవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కల్యాణ్.. మధ్యలో మోదీ నిలుచొని ముగ్గురూ చేతులు ఎత్తి అభివాదం చేశారు. ఈ దృశ్యం మెగా అభిమానులకైతే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
అక్కడున్న అభిమానులే కాకుండా మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ అయితే అరుపు, కేకలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక పవన్ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా అందరినీ వెళ్లి పలకరించారు. ఆ తరువాత చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. ఆ దృశ్యం కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎంత డిప్యూటీ సీఎం అయినా ఓ అన్నకు తమ్ముడే కదా.
RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…
కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…
టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…
అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…