ఇద్దరు ప్రముఖ హీరోలు కలిస్తే సినిమా ఎంత ఆసక్తికరంగా మారుతుందో.. వారి తనయులు ఇద్దరూ కలిసి ఒకే సినిమా కోసం వర్క్ చేసినా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా కోలీవుడ్లో దీనికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ గురించి తెలిసిందే. ఇప్పటికే ధృవ్ హీరోగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా కోలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆదిత్య వర్మ పేరుతో రూపొందిన ఈ చిత్రం ధృవ్కు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత తన తండ్రి విక్రమ్తో కలిసి ధ్రువ్ విక్రమ్ నటించిన మహాన్ చిత్రం మంచి టాకే తెచ్చుకుంది. కానీ ఆ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ క్రమంలోనే తనకు నేమ్, ఫేమ్ తెచ్చి పెట్టే సినిమా కోసం ధృవ్ ఎదురు చూస్తున్నాడు. మరోవైపుస్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తు.. ఆయన వారసుడు జాసన్ సంజయ్ కూడా సినీ రంగప్రవేశం చేస్తున్నాడు.
లండన్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చిన జాసన్కు హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతను దర్శకత్వంపైనే ఫోక్ పెట్టాడు. అలా కథను రెడీ చేసుకున్న జాసన్ సంజయ్కు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అవకాశం కల్పించింది. అయితే ఈ సినిమాలో హీరోగా ధృవ్ను అనుకుంటున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే వీరిద్దరూ ఒకే సినిమా కోసం పని చేయనున్నారు.
RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…
కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…
టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…
అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…