ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన సీట్ల పంపకం విషయంలో దాదాపు స్పష్టత వచ్చింది. ఈ జిల్లాలో మొత్తంగా 19 నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఆరు మినహా మిగిలిన అన్నింటిపైనా స్పష్టత వచ్చింది. ప్రస్తుతానికైతే టీడీపీకి పది స్థానాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పదిమందిలో బడా నేతల వారసులు కూడా ఉన్నారు. రాజమండ్రి అర్బన్లో ఆదిరెడ్డి కుటుంబానికి టికెట్ లభించింది. అయితే ఎవరికనే విషయంలో స్పష్టత రాలేదు.
ఇక తుని నుంచి సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య బరిలోకి దిగనున్నారు. మూడు సీట్లను జనసేనకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. వాటిలో కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్టు సమాచారం. ఇవి కాకుండా జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మరో రెండు సీట్లను ఆశిస్తోందని తెలుస్తోంది. వాటిలో పిఠాపురం కూడా ఉంది. అయితే పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ బలమైన అభ్యర్థిగా ఉండటంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది.
ఖరారైన పది మంది అభ్యర్థులు..
దివ్య-తుని,
వరుపుల సత్యప్రభ-ప్రత్తిపాడు
నిమ్మకాయల చినరాజప్ప-పెద్దాపురం
నల్లమిల్లి రామకృష్టారెడ్డి-అనపర్తి
దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు-కొత్తపేట
వేగుళ్ల జోగేశ్వరరావు-మండపేట
గోరంట్ల బుచ్చయ్య చౌదరి- రాజమండ్రి రూరల్
జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట..
రాజమండ్రి అర్భన్ – ఆదిరెడ్డి కుటుంబానికే ఎర్రన్నాయుడి కూతురా? లేదంటే కొడుకా? అనే విషయంలో స్పష్టత రాలేదు.
RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…
కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…
టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…
అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…