తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎలుక పోరు.. ఎలుక పోరు.. పిల్లి తీర్చినట్టుగా అయిపోయింది పరిస్థితి. బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ లాభపడింది. తన పనులు తాను సైలెంట్గా చేసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీకి వలసలు కూడా బీభత్సంగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ బాగా కృషి చేస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ పెద్దగా బీజేపీని టార్గెట్ చేయకపోవడం.. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం వెనుక బీజేపీ అధిష్టానం హస్తముందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ అంశాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనడానికి ఈ కారణాలను చూపిస్తోంది. ఇక ప్రధాని మోదీ వరంగల్ సభకు కేంద్రం సీఎం కేసీఆర్ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరైతే కనుక కాంగ్రెస్కు మరో అస్త్రం చిక్కినట్టే. ఇక బీజేపీ నాయకత్వ మార్పుతో మూడు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుత చీఫ్ కిషన్ రెడ్డి వర్గం, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వర్గం, బండి సంజయ్ వర్గం. ఈ వర్గ విభేదాలతో బీజేపీ మరింత వెనుకబడిపోయింది. ఇదే సమయంలో విభేదాలన్నీ పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్లో ఉంది. చేరికలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు సైతం ఫుల్ యాక్టివ్గా జనాల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సత్ఫలితాలను ఇస్తోంది
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…