బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఎం తానే అవుతానని కొత్త కాన్వాయ్ను కేసీఆర్ సిద్ధం చేసుకున్నారట. రూ.3 కోట్ల చొప్పున వెచ్చించి 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలకు కొనుగోలు చేశారట. వాటిని విజయవాడలో దాచి పెట్టారంటూ సీఎం రేవంత్ వెల్లడించారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఆ వాహనాల్లో తిరగొచ్చని కేసీఆర్ భావించారట.
అయితే తాను తన కాన్వాయ్ కోసం కొత్తది ఎందుకు కొనడం.. పాతదాన్నే మరమ్మతులు చేయించుకుంటే పోలా? అని అనుకుని అధికారులకు చెప్పారట. ఆ సమయంలోనే ఓ అధికారి కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిన విషయాన్ని బయటపెట్టారన్నారు. రేవంత్ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. అసలెందుకు కేసీఆర్ తన వద్ద వాహనాలుండగా.. కొత్త కాన్వాయ్ను అది కూడా పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించి కొన్నారంటూ చర్చలు జరుగుతున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వినియోగిస్తున్న 10 ఫార్ట్యూన్ వాహనాలకు మరికొన్ని జతయ్యాయన్నారు. ఈ క్రమంలోనే కొన్ని ల్యాండ్ క్రూయిజ్ వాహనాలు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరగా.. వాటిని విజయవాడలోని ఓ వర్క్ షాపుకు తరలించినట్టు వెల్లడించారు. అక్కడ వాటన్నింటినీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందంని క్రిశాంక్ తెలిపారు. అలాగే కేసీఆర్ మరో రెండు బస్సులను సైతం బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తున్నారంటూ వెటకారంగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో ఓడిపోతామనే భయం కలిగిన పార్టీలు, నేతలు తమ…
మారవా.. నువ్వు మారవా అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా..! ఇంకోటి చెబుతా ఆగండి.. నువ్వు యదవ కాదు అని…
స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ ఒక పోస్ట్ పెట్టి…
ఒక డిఫరెంట్ మేనరిజంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్లో పుష్ప సినిమాను హిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప…
ఏపీ రాజకీయాలు బీభత్సమైన హీట్ను రాజేస్తున్నాయి. ఈసారి అన్నా చెల్లెళ్లు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతుళ్లుగా విడిపోయి మరీ ఒకరిపై…
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఎల్లో మీడియా కుట్రలో భాగమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్ చేసి వెంటనే…