Sarath Chandra Reddy: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి(Sarath Chandra Reddy) ఆప్రూవర్‌గా మారారు. తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని కోరుతూ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. దీనికి సీబీఐ కోర్టు(CBI Court) సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది నవంబర్‌లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారారు. ఇక నేడు శరత్ చంద్రారెడ్డిSarath Chandra Reddy) సైతం అప్రూవర్‌గా మారడంతో సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాంలో మరోసారి తెరపైకి రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డిSarath Chandra Reddy) అప్రూవర్‌గా మారారు కాబట్టి తాను కవిత ప్రేరణతోనే మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని చెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉన్నదని.. అయినా కూడా ఆమెపై కేంద్రం చర్యలు కావాలనే తీసుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలంటే.. కేసీఆర్‌(KCR) కుటుంబాన్ని కేసుల వలయంలో ఇరికిస్తే తప్ప సాధ్యం కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే.. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఏదో అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement
Sootiga Team

Recent Posts

చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే వలంటీర్ వచ్చి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు వలంటీర్ రావడం లేదు.…

May 2, 2024

విడాకుల వార్తలపై భర్తతో కలిసి క్లారిటీ ఇచ్చిన నటి ఇంద్రజ

సోషల్ మీడియా సామన్యులనైతే పట్టించుకోదు కానీ ప్రముఖులను అందునా సెలబ్రిటీలను వదిలేస్తుందా? చిన్న పాయింట్ దొరికితే చాలు నానా యాగీ…

May 1, 2024

ఐపీఎల్‌లో ప్రభాస్.. అందరి ఫోకస్ ఆయనపైనే.. కారణమేంటంటే..

నేషనల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD . ఈ…

May 1, 2024

‘కల్కి’పై కాపీ కామెంట్స్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే..

నేషనల్ స్టార్ ప్రభాస్‌ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచి విడుదలయ్యే వరకూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం…

May 1, 2024

ఫస్టొచ్చింది… పెన్షన్ రాలేదు.. చంద్రబాబుపై పెన్షనర్ల మండిపాటు

ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పెన్షనర్లకు ఎదురు చూపు కూడా అవసరం లేకుండా ఇంటి ముందు క్షేమ సమాచారాలతో వలంటీర్…

May 1, 2024

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఒక్కసారిగా అలా కనిపించడంతో నెటిజన్లు షాక్..

జూనియర్ ఎన్టీఆర్.. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి ముంబై వెళ్లాడు. వార్ 2 షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఎన్టీఆర్…

May 1, 2024