పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ జగన్‌కే గుద్ది పడేస్తున్న ఉద్యోగులు

పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉద్యోగులు గుద్ది పడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. కాగా అధికశాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ వైపు పొలవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ఉద్యోగులను చిన్నచూపు చూడటం..వాళ్లకు జీతాలేందుకు అని అవహేళన చేయడం వంటివన్నీ ఉద్యోగుల మైండ్‌లో బలంగా నాటుకు పోయాయి.

అలాగే వైయస్ జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్( జీపీఎస్) వంటి పథకాలన్నీ తమకు చాలా ఉపయోగపడతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలిసిందే. మళ్లీ చంద్రబాబును తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టుకోవడానికి వారు సిద్ధంగా లేరు. మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడుతున్నారు. పైగా చంద్రబాబును ఏమాత్రం నమ్మే పరిస్థితి ఉద్యోగుల్లో లేదు. పైగా పాలిచ్చే గేదెను కాదనుకుని.. దున్నపోతును ఎవరు కోరుకుంటారు? ఏపీ ప్రజలు కూడా ఇప్పుడు చేస్తున్నది అదే. 

Advertisement

ఇది చాలదన్నట్టుగా చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడలేని డబ్బు సరిపోదు. మరి అంత డబ్బు ఏపీలో ఉందా? రాష్ట్ర బడ్జెట్ మొత్తం కుమ్మరించినా కూడా చంద్రబాబు చెబుతున్న పథకాలకు ఒక మూలకు కూడా రాదు. అలాంటపుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా రావని ఉద్యోగులు భయపడుతున్నారు. దీంతో ఉద్యోగులంతా జగన్ మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉద్యోగులంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు గుద్ది పడేస్తున్నట్టు సమాచారం.

Advertisement
Sootiga Team

Recent Posts

బుల్లితెరపై విషాదం.. ఇద్దరు ఫేమస్ నటుల మృతి.. ప్రియురాలు చనిపోయిందని..

బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…

May 18, 2024

చేతికి కట్టుతో దర్శనమిచ్చిన ఐశ్వర్యారాయ్.. అసలు ఆమెకు ఏమైంది?

మాజీ ప్రపంచ సుంద‌రి, బాలీవుడ్ స్టార్ న‌టి ఐశ్వర్యా రాయ్ బ‌చ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్‌లో జ‌రుగుతున్న…

May 18, 2024

జగన్‌లో ఉన్న ధీమా.. కూటమిలో లేదేంటి?

ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…

May 18, 2024

రష్మిక, సాయి పల్లవి, కీర్తిలలో స్టార్ స్టేటస్ ఎవరిది?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌గా ఓ రేంజ్‌లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…

May 18, 2024

ఫైనల్‌గా జీవితంలోకి ఒకరొస్తున్నారంటూ ప్రభాస్ ట్వీట్.. ఫ్యాన్స్ హ్యాపీ

పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదిగాడు. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్‌లో టాలీవుడ్‌లో…

May 17, 2024

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…

May 17, 2024