నా తండ్రి హత్య కేసులో జగన్, అవినాశ్ రెడ్డిల హస్తముంది: సునీతారెడ్డి సంచలనం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య కేసు గురించి ప్రస్తావించారు. తన తండ్రి హత్య కేసులో ఏపీ సీఎం జగన్‌తో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డిల హస్తముందంటూ సంచలనానికి తెరదీశారు. జగన్‌తో పాటు ఆయన పార్టీ వైసీపీకి ఓటేయవద్దని కోరారు. తన తండ్రి హత్య కేసులో తన పోరాటానికి ప్రజల మద్దతును సునీతారెడ్డి అర్థించారు. మార్చురీ వద్ద అవినాశ్‌తో మాట్లాడానని కానీ హంతకులు మన మధ్యే ఉంటారన్న విషయం నాడు తనకు తెలియలేదన్నారు. తండ్రి హత్య జరిగిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు వెళదామని జగన్‌ను అడిగితే వద్దని వారించారని సునీత తెలిపారు. ఒకవేళ సీబీఐ దర్యాప్తునకు వెళితే ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళతారని జగన్ చెప్పారన్నారు.

జగనే వాళ్లిద్దరినీ రక్షిస్తున్నారు..

అయినా సరే తాను వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని.. తనను, తన భర్తను నాటి నుంచి వేధిస్తున్నారని సునీతరెడ్డి తెలిపారు. చివరకు సీబీఐ పైన కూడా కేసులు పెట్టి.. విచారణను ముందుకు సాగకుండా చూశారన్నారు. తన తండ్రి హత్య కేసులో బాబాయి భాస్కరరెడ్డితో పాటు ఆయన తనయుడు అవినాశ్ రెడ్డి ప్రమేయముందని తెలిపారు. వారిద్దరినీ జగనే రక్షిస్తున్నారని సునీతారెడ్డి ఆరోపించారు. ఇక సీబీఐ ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కుంటోందో తనకు తెలియదన్నారు. మొదటి నుంచి తనకు అండగా షర్మిలే ఒక్కరే ఉన్నారు. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి వారంతా తనకు అండగా నిలిచారన్నారు. 700 మందికి పైగా కుటుంబ సభ్యులు ఉండటంతో తమది వసుదైక కుటుంబమని ఆనదించానని.. ఎన్ని గొడవలున్నా అందరం కలిసే ఉన్నామన్నారు కానీ తనకు కష్టమొస్తే ఎవరూ అండగా రాలేదని సునీతారెడ్డి వాపోయారు.

గొడ్డలితో చంపారని జగన్‌కెలా తెలుసు?

తన తండ్రి హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలని సునీతారెడ్డి డిమాండ్ చేశారు. అసలు తన తండ్రిని గొడ్డలితో నరికి చంపారనే విషయం జగన్‌కి ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇలాంటి క్రైంలు మున్ముందు కనిపించొద్దంటే ప్రజలంతా ముందుకు రావాలన్నారు. తనది న్యాయమైన పోరాటమని గుర్తిస్తే ఎవరూ జగన్‌కు ఓటు వేయరన్నారు. ఎవరైనా సరే.. ముందుగా సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించరని.. అందుకే జగన్ ని కలిసినప్పుడు తనకు ఆయనపై అనుమానం రాలేదన్నారు. తన తండ్రి హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయని.. ఇంకా బయటకు రావల్సిన పేర్లు చాలా ఉన్నాయని సునీతారెడ్డి తెలిపారు. అసలు ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. జాతీయ మీడియా సైతం తన తండ్రి మరణ వార్తను పట్టించుకోవడం లేదని సునీతా రెడ్డి దుయ్యబట్టారు. . 

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024