ఏపీలో కొత్త పార్టీ.. అసెంబ్లీ బరిలో ఉంటుందా?

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే కొత్త పార్టీలు సైతం పుట్టుకొస్తున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ పార్టీ పేరుతో తన పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. గత ఏడాదే రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ ఎందుకో దీనిని వెలుగులోకి తీసుకురాలేదు. తాజాగా ఆయన తన పార్టీని లాంచ్ చేయడంతో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జై భారత్ పార్టీ ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోటీలోకి దిగనుంది.

ఇక జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టుగా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 2019లో లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుంచి వైజాగ్ పార్లమెంటు బరిలో నిలిచారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జనసేన నుంచి బయటకు వచ్చి కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పినా కూడా ఆయనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఇక లక్ష్మీనారాయణే స్వయంగా పార్టీని స్థాపించి తన పార్టీ నుంచే విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్ గురించి రకరకాలు కథనాలు ప్రచారం జరిగాయి. ఏ నేతను పొగిడితే ఆ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం నిర్వహించారు. తాను ఏ పార్టీకీ సపోర్ట్ ఇవ్వడం లేదని లక్ష్మీనారాయణ క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన పార్టీ నుంచి ఎంత మంది అభ్యర్థులను అసెంబ్లీ బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Sootiga Team

Recent Posts

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…

May 19, 2024

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్‌లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…

May 19, 2024

మహేష్ – రాజమౌళి కాంబో గురించి వస్తున్న వార్తలు ఫేక్ అట..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…

May 19, 2024

ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ రాబోతోంది..

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ చిత్రం దేవర. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఊర మాస్…

May 18, 2024

బుల్లితెరపై విషాదం.. ఇద్దరు ఫేమస్ నటుల మృతి.. ప్రియురాలు చనిపోయిందని..

బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…

May 18, 2024

మొన్న ఔట్.. నేడు ఇన్.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది?

మెగా బ్రదర్‌ నాగబాబుకు ఆవేశం ఎక్కువ. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తేవడంలో ఆయన దిట్ట. ఈ ఆవేశంతోనే…

May 18, 2024