తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) ఎట్టకేలకు మౌనం వీడారు. మొన్నటి వరకూ ఎందుకోగానీ ఆయన ఏ విషయంపైనా స్పందించలేదు. కర్ణాటక ఎన్నికలు, రెండు వేల నోటు రద్దు, కొత్త పార్లమెంటు ఓపెనింగ్కు రాష్ట్రపతిని పిలవకపోవడం వంటి అంశాలపై ఆయన పెదవి విప్పలేదు. ఇది కాస్తా తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.
జాతీయ స్థాయిలో రాణించాలనుకున్న కేసీఆర్.. అసలు ఎందుకు ఏ విషయంపై కూడా ఎందుకు స్పందించడం లేదనేది ఆసక్తికరంగానూ.. చర్చనీయాంశంగానూ మారింది. మొత్తానికి తాజాగా కేసీఆర్ మౌనం వీడారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. కర్ణాటకలో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారని అయినా కూడా కేంద్రం మారకపోతే ఎలా? అని ప్రశ్నించారు. కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరాయంటూ మండి పడ్డాయని.. మోదీ ప్రభుత్వం దేశాన్ని ఎటు తీసుకెళ్తోందంటూ ఫైర్ అయ్యారు. అలాగే గవర్నర్ వ్యవస్థపై కూడా తీవ్ర స్థాయిలో కేసీఆర్ స్పందించారు. కేవలం గవర్నర్ పదవి అలంకారప్రాయమని.. అలాంటి గవర్నర్ బడ్జెట్ పాస్ కానివ్వనంటే ఎలా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ ప్రవేశ పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య దుస్థితి ఎక్కడైనా ఉంటుందా? అని మండిపడ్డారు. మొత్తానికి బీజేపీపై విమర్శలతో ఫుల్ స్టాప్ పడుతుందో లేదంటే ఇంకా కొనసాగుతాయో వేచి చూడాలి.
‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…
టిల్లు స్క్వేర్తో మళ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్బాస్ షో ఎవరికి…
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…