ఏపీలో మో‘ఢీ’మొదలెట్టారుగా..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎవరి వ్యూహాల్లో వారున్నారు. విజయం కోసం పార్టీలన్నీ విపరీతంగా శ్రమిస్తున్నాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ అంటే ఎలక్షన్ కోడ్ మొదలవడానికి ముందే అధికార వైసీపీ తమకు అనుకూలంగా ఉండే అధికారులందరినీ కావల్సిన ప్రదేశాలకు ట్రాన్స్‌ఫర్ చేసేసింది. ఇప్పుడు ఇక విపక్షాల వంతు. ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీలో మోదీ మార్క్ రాజకీయం ప్రారంభమైంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులందరి బదిలీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం దాదాపు ఖాయమైపోయినట్టే. వీరే కాకుండా దాదాపు అరడజను మంది ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు వేయనున్నట్టు సమాచారం. దీనిపై మరికొన్ని గంటల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

సీఎస్‌తో పాటు డీజీపీ బదిలీ ఒకేసారి జరగడమనేది ఇప్పటి వరకూ లేదు. వీరిద్దరి బదిలీ జరిగితే మాత్రం ఇదే తొలిసారి అవుతుంది. వైసీపీకి అనుకూలంగా నడుచుకునే ఉద్యోగులందరిపై వేటు పడటం ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తానికి మోదీ మార్క్ రాజకీయమైతే ఏపీలో ప్రారంభమైంది. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న మోదీ.. ఇప్పుడు అధికారుల బదిలీతో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. వీరిద్దరూ బదిలీపై వెళ్లిపోయారంటే వైసీపీకి కొంతవరకూ గడ్డు కాలం ప్రారంభమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు ఇంకా ఏం జరుగుతుందో.. జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి మోదీ సర్కార్ ఏమేం చేస్తుందో చూడాలి మరి.

Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024