టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ మెట్టు దిగారు. ఇప్పటికే తనను విభేదించిన వారిని సైతం కలుపుకు పోయే యత్నం చేస్తున్న రేవంత్ ఇప్పుడు మరో మెట్టు దిగి.. తనవారు, పరాయి వారన్న భేదం లేకుండా అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. కర్ణాటక ఫలితాలను తెలంగాణలో రిపీట్ చేయాలన్న లక్ష్యంతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని శత విధాలా యత్నిస్తున్నారు.
కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఫుల్ జోష్తో పని చేస్తున్నారు. ఈ జోష్కి తోడు పార్టీ నుంచి వెళ్లిపోయిన వారితో పాటు బీఆర్ఎస్, బీజేపీలను వీడిన వారిని కాంగ్రెస్లోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ యత్నిస్తున్నారు.
ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులకు ఆహ్వానం పలికారు. తనతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్న వారి కోసం మరో ప్రత్యేక సూచన కూడా చేశారు. తాను ఒక పార్టీ కార్యకర్తను మాత్రమేనని పార్టీలో మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీలు మాత్రమే పెద్ద నాయకులని.. పార్టీలో చేరాలని అనుకుంటే.. వాళ్లతో నేరుగా మాట్లాడుకోవచ్చన్నారు.
మొత్తానికి కీలక నేతలకైతే ఆహ్వానం పలికేశారు. వారు రేవంత్ అభ్యర్థనను మన్నించి వస్తే మాత్రం పార్టీ భవిష్యతే మారిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…
కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…
టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…
అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…