బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టుగానే తెలుస్తోంది. ఇక ఈ రెండు పార్టీల మధ్య సీట్ల అంశమే కాస్త అడ్డంకిగా మారింది. దీనిని దాటేశారో ఇక అభ్యర్థులను ప్రకటించేసుకుని ముందుకు వెళ్లడమే. ఏపీలో బీజేపీకి ఏమాత్రం పట్టు లేదు. సొంతంగా బరిలోకి దిగితే డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. అలాంటి బీజేపీకి ఆశలు భారీగానే ఉన్నాయని సమాచారం. శక్తికి మించిన సీట్లను బీజేపీ కోరుతోందట. బీజేపీ లేకుంటే శక్తవంతమైన వైసీపీని ఢీకొట్టడం కష్టమని టీడీపీ భావిస్తోంది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ పార్టీ సీనియర్లు పొత్తు విషయమై కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. ఇష్టానుసారంగా పొత్తులకు అంగీకరించవద్దని.. పొత్తు ఉభయతారకంగా ఉంటేనే ఓకే చెప్పాలని తెలిపారట. ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు దాదాపు 30 సీట్లు వెళ్లిపోయాయని.. ఇక బీజేపీకి సైతం కోరినన్ని సీట్లు ఇస్తే టీడీపీలోని పలువురు నేతల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. దీంతో మొదటికే మోసం వస్తుందని సూచించారట.
పార్టీ నేతల సూచనల తర్వాత బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. కానీ బీజేపీ మాత్రం భారీగానే కోరుతోందట. 25 అసెంబ్లీ, దాదాపు 8 ఎంపీ స్థానాలు కోరుతోందట. అన్ని ఇస్తే టీడీపీలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి చంద్రబాబు అయితే ఈ సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట.నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇది పూర్తైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…