ఆ ప్రాంతాలపై పట్టు బిగిస్తున్న వైఎస్ జగన్

ఏపీలో ఎన్నికల వేడి బాగా పెరిగింది. పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ కూడా వ్యూహాలకు పదును పెట్టి మరీ రంగంలోకి దిగారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వైసీపీకి కొంత మేర టఫ్ అనే చెప్పాలి. అందుకే ముందుగా జగన్ తమ బలంతో పాటు బలహీనతలను అంచనా వేసుకున్నట్టు సమాచారం.  ఈ క్రమంలోనే ఎక్కువగా ఏ ఏ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలనే విషయాన్ని కూడా ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుగా పెద్ద ఎత్తున జగన్ అభ్యర్థులనైతే మార్చేశారు. ఈ పార్టీకి రాయలసీమలో బాగా పట్టుంది. ఈ క్రమంలోనే అక్కడ పట్టు ఏమాత్రం తగ్గకుండా స్కెచ్ అయితే గీసుకున్నారు. ఇక తమకు కాస్త పట్టు తక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన స్థానాలతో పాటు తమ పార్టీ విజయం సాధించిన స్థానాలను మూడు వర్గాలుగా విభజించినట్టు సమాచారం.

Advertisement

ఒకటి వచ్చేసి గత ఎన్నికల్లో వైసీపీ పదివేలకు పైన మెజారిటీ సాధించిన స్థానాలు.. రెండోది 10 వేల నుంచి 5 వేల మెజారిటీ మధ్య విజయం సాధించిన స్థానాలు.. మూడోది 5 వేల లోపు విజయం సాధించిన స్థానాలుగా విభజించారు. ముఖ్యంగా జగన్.. పైన చెప్పిన రెండు, మూడు వర్గాలపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఐదు వేల లోపు మెజారిటీ సాధించిన స్థానాలు 12 ఉన్నాయి. అలాగే 10 వేల నుంచి 5 వేల లోపు మెజారిటీ సాధించిన స్థానాలు 44 ఉన్నాయి. ఈసారి వీటిపై పట్టు కోల్పోతే పార్టీ ఓటమి ఖాయం.  అందుకే ఈ ప్రాంతాలపై జగన్ పట్టు బిగిస్తున్నారని టాక్.

Advertisement
Sootiga Team

Recent Posts

బాబు ఫిర్యాదుతో సంక్షేమ పథకాలకు ఈసీ మోకాలడ్డూ… ప్రజల వెతలు

మారవా.. నువ్వు మారవా అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా..! ఇంకోటి చెబుతా ఆగండి.. నువ్వు యదవ కాదు అని…

May 6, 2024

సమంత తాను నగ్నంగా ఉన్న పిక్ షేర్ చేసి.. డిలీట్ చేసిందా?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ ఒక పోస్ట్ పెట్టి…

May 6, 2024

పుష్ప 2 నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..

ఒక డిఫరెంట్ మేనరిజంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో పుష్ప సినిమాను హిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప…

May 6, 2024

చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌: ముద్రగడ

ఏపీ రాజకీయాలు బీభత్సమైన హీట్‌ను రాజేస్తున్నాయి. ఈసారి అన్నా చెల్లెళ్లు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతుళ్లుగా విడిపోయి మరీ ఒకరిపై…

May 6, 2024

ఎల్లో ట్రాప్ లో రమేష్… తప్పు పోస్ట్ తో పేరు మటాష్

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఎల్లో మీడియా కుట్రలో భాగమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్ చేసి వెంటనే…

May 6, 2024

నాడు ఒప్పయింది నేడు తప్పయిందా ? నాలుక మడతేసిన టీడీపీ, ఎల్లో మీడియా

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ.. దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఎక్కడ ఈ యాక్ట్‌తో…

May 6, 2024