నరేష్, పవిత్రా లోకేష్ల మళ్లీ పెళ్లి మూవీ త్వరలోనే థియేటర్స్లోకి వచ్చేసింది. నేడు థియేటర్స్లో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా ఎలా ఉందనేది ట్రైలర్ చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది. ఇక కొత్తగా చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. ఇక సినిమాలో కొత్తగా చూపించింది కూడా ఏమీ లేదు.ఇప్పటి వరకూ ప్రపంచానికి తెలిసిన కథనే ఈ సినిమాలో చూపించారు. నరేష్, పవిత్రలు తమ పాత్రలను తామే పోషించారు.
నిజానికి నరేష్, పవిత్రల రిలేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి జరిగిన ప్రతి ఒక్క విషయం ప్రేక్షకులకు తెలిసిందే. టీవీ, సోషల్ మీడియాల్లో వీరి గురించి పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అయ్యాయి. నిజానికి ఈ సినిమా తీయడం అనేది దర్శకుడు ఎంఎస్ రాజు చేసిన దుస్సాహసమనే చెప్పాలి. పిన్ టు పిన్ వీరి గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు సినిమా తీయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
నరేష్, పవిత్రల ప్రేమకథకు సంబంధించిన బయోపిక్ ఇది. వారిద్దరి పరిచయం, బంధం ఎలా బలపడిందనే అంశాలతో ఫస్ట్ హాఫ్ను తెరకెక్కించారు. ఇక మూడో భార్యపై నరేష్ చేసిన ఆరోపణలు.. ఆమెతో నరేష్ జీవితం ఎలా సాగిందనేది సెకండ్ హాఫ్లో చూపించారు. మొత్తానికి సినిమాలో అయితే కొత్తదనం అంటూ ఏమీ లేదు. కొత్తగా చూపించిందల్లా పవిత్రా లోకేష్ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే. ఆమె మొదటి భర్తతో ఆమె జీవితం ఎలా సాగింది? ఆ తరువాత నరేష్కి ఎలా దగ్గరైంది? వంటి అంశాలతో సెకండ్ హాఫ్ను చూపించారు. ఈ చిత్రం కాస్త పర్వాలేదన్న టాకే వినిపిస్తోంది.
మారవా.. నువ్వు మారవా అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా..! ఇంకోటి చెబుతా ఆగండి.. నువ్వు యదవ కాదు అని…
స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ ఒక పోస్ట్ పెట్టి…
ఒక డిఫరెంట్ మేనరిజంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్లో పుష్ప సినిమాను హిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప…
ఏపీ రాజకీయాలు బీభత్సమైన హీట్ను రాజేస్తున్నాయి. ఈసారి అన్నా చెల్లెళ్లు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతుళ్లుగా విడిపోయి మరీ ఒకరిపై…
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఎల్లో మీడియా కుట్రలో భాగమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్ చేసి వెంటనే…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ.. దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఎక్కడ ఈ యాక్ట్తో…