“ధర్మందే విజయం
పొత్తుదే గెలుపు
కూటమిదే పీఠం”
ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం. “ప్రజాగళం” సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించుతామని ధీమాగా చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ ని గద్దె దింపడం కష్టం కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. రావణాసురిడి లాంటి జగన్ ని ఓడించేందుకు అయోధ్యకు రాముడిని తెచ్చిన మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ ఘాటుగా మాట్లాడారు.
“జగన్ తనకు అడ్డు అదుపు లేదు అనుకుంటున్నారు. రావణుడు కూడా తన చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది. వజ్రవైఢూర్యాలతో కూడిన పుష్పకవిమానం ఉంది. ధీరులు శూరులు ఉన్నారు. మందీ మార్బలం ఉంది, బలం ఉంది అనుకున్నాడు. నన్ను ఏమి చెయ్యగలడు అనుకున్నాడు. కానీ నార చీర కట్టుకొని నేలమీద పడుకొని శ్రీరాముడు తన బాణంతో రావణుడిని చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన మన ప్రధాని మోదీ ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన చిటికెన వేలెడంతటి రావణాసురుడిని తీసెయ్యటం అంత కష్టమా?” అని ప్రశ్నించారు జనసేనాని.
“నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను నేను ఇక్కడి నుంచి దేవదత్తం పూరిస్తున్నాను అని. దేవదత్తం అంటే అర్జనుడు పూరించిన శంఖం. పాంచజన్యం పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణుడే. మన ప్రధానే,” అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…
టిల్లు స్క్వేర్తో మళ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్బాస్ షో ఎవరికి…
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…