వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం: మోదీ

తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి మొదటి సభని ఆదివారం నిర్వహించాయి. ఈసారి ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించిన “ప్రజాగళం” సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ప్రధానితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సభావేదికని పంచుకున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ సభని నిర్వహించారు. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

ప్రధాని స్పీచ్ ప్రధానాంశాలు

  • ఈసారి ఎన్డీఏ కూటమికి 400 + స్థానాలు వస్తాయి అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మమ్మల్ని గట్టిగా ఆశీర్వాదించాలి. ఆ సంఖ్య మరింతగా పెరుగుతుంది.
  • వికసిత భారత్ మా లక్ష్యం. దాంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ ని చూడాలనుకుంటున్నాం.
  • అవినీతిలో కూరుకుపోయిన ఇక్కడి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి. మీరు రెండు సంకల్పాలు తీసుకోవాలి. ఒకటి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని మళ్ళీ నెలకొల్పాలి. రెండోది రాష్టంలో మా కూటమిని అధికారంలోకి తేవాలి.
  • ఎన్టీఆర్ కాంగ్రెస్ ని మట్టికరిపించారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే తెలుగుదేశం పుట్టింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వంద రూపాయల వెండి నాణెం విడుదల చేశాం. తెలుగువాడైన మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నాం.
  • కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ ఒక్కటే. రాష్టంలో రెండు పార్టీలను ఒకే కుటుంబానికి చెందిన వారు నడుపుతున్నారు. అంటే ఆ రెండుపార్టీలు ఒక్కటే.
Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024