కలర్స్ స్వాతి.. బుల్లితెరపై తన కెరీర్ను ప్రారంభించి.. ఆపై వెండితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూత్ అయితే స్వాతిని అసలు మరచిపోలేరు. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకుని కలర్స్ స్వాతిగా స్థిరపడిపోయింది. ఆ తరువాత డేంజర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తరువాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో పూజ పాత్రతో మెరిసింది.
పూజ పాత్రకు అయితే విపరీతమైన గుర్తింపు వచ్చింది. అష్టా చమ్మా మూవీతో హీరోయిన్గా మారింది. ఈ సినిమా కలర్స్ స్వాతికి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఆ తరువాత వివాహం చేసుకుని టాలీవుడ్కి దూరమైంది. ఇటీవలే తిరిగి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మంత్ ఆఫ్ మధు సినిమాతో పలకరించింది.
అయితే కలర్స్ స్వాతి సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటుంది. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్.. ‘ఛీ నీ బతుకు..’ అని కామెంట్ చేశాడు. దీనిపై ఫైర్ అవకుండా కలర్స్ స్వాతి చాలా డీసెంట్గా బిహేవ్ చేసింది. నెటిజన్ కామెంట్ స్క్రీన్షాట్ను షేర్ చేసి.. తనకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంటుందని చెప్పింది. వెంటనే ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటుందట. తన కామెంట్కు నో దిష్టి అనే సింబల్ను జత చేసింది.
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…