కీర్తి సురేష్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘మహానటి’. ఆమె కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నా కూడా మొదట గుర్తొచ్చేది మాత్రం మహానటే. లెజెండరీ నటి సావిత్రి పాత్రలో కీర్తి జీవించేసింది. ఎన్నో అవార్డులను ఈ సినిమాకు అందుకుంది. కానీ స్టార్ స్టేటస్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇక అమ్మడు బాలీవుడ్లో సైతం అడుగు పెట్టింది. అక్కడ వరుణ్ దావన్కి జంటగా నటిస్తోంది.
అయితే కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో చాలా స్లిమ్ అయిపోయింది. ఇదే ఆమెకు అవకాశాలను దూరం చేస్తోంది. వరుణ్ ధావన్తో కంటే ముందే బాలీవుడ్లో ‘మైదాన్’ సినిమా అవకాశం కీర్తి సురేష్కే మేకర్స్ ఇవ్వాలనుకున్నారట. ఈ సినిమా పేరు ‘మైదాన్’. ఈ సినిమాలో కీర్తి సురేష్.. అజయ్ దేవగన్తో కలిసి నటించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ అవకాశం కీర్తిని కాదనుకుని ప్రియమణికి వెళ్లిపోయింది.
ఈ విషయాన్ని స్వయంగా మైదాన్ మూవీ మేకర్సే తెలిపారు. మైదాన్ దర్శకుడు అమిత్ శర్మ ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ.. అజయ్ దేవగన్కి భార్య పాత్రలో తొలుత కీర్తి సురేష్ను అనుకున్నామని అయితే ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించామన్నారు. కీర్తి బరువు తగ్గి సన్నగా మారడంతో ఆమె ఆ పాత్రకు సెట్ కాలేదని అందుకే ప్రియమణితో ఈ సినిమా చేసినట్టు అమిత్ వెల్లడంచారు. కొన్ని సార్లు సన్నగా ఉన్నా ఇబ్బందే..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…
బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…
మెగా బ్రదర్ నాగబాబుకు ఆవేశం ఎక్కువ. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తేవడంలో ఆయన దిట్ట. ఈ ఆవేశంతోనే…
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్లో జరుగుతున్న…
ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్గా ఓ రేంజ్లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…