గురు, శిష్యుల మధ్య పోటీ.. ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న స్థానం ఇదే..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుందంటారు. ఈ క్రమంలోనే ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు తొలుత చీపురుపల్లి టికెట్ ఇస్తామని చెప్పారట. కానీ గంటా మాత్రం ససేమిరా అనేశారట. దీనికి కారణం మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాఖా కావడమే. అక్కడ బొత్సదే హవా. ఆయనను ఎదుర్కొని నిలవడం చాలా కష్టం అందుకే.. అయితే భీమిలి లేదంటే లేదని గంటా సైలెంట్ అయ్యారు.

గంటా ఈ మధ్య కాలంలో చాలా హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే తాజాగా గంటాకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయనకు భీమిలి టికెట్‌ను చంద్రబాబు ఇస్తున్నారట. దీనికి కారణం ఆయన సామాజిక వర్గమేనని టాక్. పైగా భీమిలిలో అవంతి శ్రీనివాస్‌ను ఎదుర్కోవాలంటే గంటాకే సాధ్యమని చంద్రబాబు భావించారట. సర్వేలోనూ ఇదే తేలిందట. దీంతో భీమిలి టికెట్‌ను గంటాకు ఇస్తేనే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారట.

Advertisement

ఈ క్రమంలోనే గంటాకు చంద్రబాబు సంకేతాలు కూడా ఇచ్చేశారట. దీంతో రెట్టించిన ఉత్సాహంతో గంటా పనులు మొదలు పెట్టారట. భీమిలిలో గంటా పోటీ అంటే ఒకరకంగా గురు శిష్యుల మధ్య పోటీయే. అవంతి నిజానికి గంటా శిష్యుడే కావడం గమనార్హం. ఆయనే అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అలాంటి గురు, శిష్యుల మధ్య పోటీ చూడాలని ఎవరికి ఉండదు. వచ్చిన వార్త నిజమే అయితే మాత్రం ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న స్థానాల్లో భీమిలి కూడా ఒకటి కావడం ఖాయం. 

Advertisement
Sootiga Team

Recent Posts

మహిళలపై టీడీపీ వరుసదాడులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో ఓడిపోతామనే భయం కలిగిన పార్టీలు, నేతలు తమ…

May 8, 2024

బాబు ఫిర్యాదుతో సంక్షేమ పథకాలకు ఈసీ మోకాలడ్డూ… ప్రజల వెతలు

మారవా.. నువ్వు మారవా అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా..! ఇంకోటి చెబుతా ఆగండి.. నువ్వు యదవ కాదు అని…

May 6, 2024

సమంత తాను నగ్నంగా ఉన్న పిక్ షేర్ చేసి.. డిలీట్ చేసిందా?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ ఒక పోస్ట్ పెట్టి…

May 6, 2024

పుష్ప 2 నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..

ఒక డిఫరెంట్ మేనరిజంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో పుష్ప సినిమాను హిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప…

May 6, 2024

చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌: ముద్రగడ

ఏపీ రాజకీయాలు బీభత్సమైన హీట్‌ను రాజేస్తున్నాయి. ఈసారి అన్నా చెల్లెళ్లు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతుళ్లుగా విడిపోయి మరీ ఒకరిపై…

May 6, 2024

ఎల్లో ట్రాప్ లో రమేష్… తప్పు పోస్ట్ తో పేరు మటాష్

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఎల్లో మీడియా కుట్రలో భాగమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్ చేసి వెంటనే…

May 6, 2024