సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టుకు ఎస్ఎస్ఎంబీ 29 పేరిట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్ దుబాయ్కు వెళ్లి.. ఇటీవలే అక్కడ పనులు ముగించుకుని వారంతా హైదరాబాద్కు చేరుకున్నారు.
మహేష్, రాజమౌళి తదితరులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మహేష్ లుక్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. మునుపెన్నడూ కనిపించని లుక్లో మహేష్ ఆకర్షిస్తున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ లేటెస్ట్ లుక్ రాజమౌళి సినిమాకు సంబంధించిందేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మహేశ్బాబు-రాజమౌళిని ఒకే ఫ్రేమ్లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్ను ఎవరూ టచ్ చేయలేదట. ఈ విషయాన్ని స్వయంగా రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఈ సినిమాకు ‘మహరాజ్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక ఈసినిమాకు సంబంధించి 8 లుక్స్ ట్రై చేసిన రాజమౌళి.. చివరకు మహేష్ వీడియోలో కనిపించిన లుక్ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో…
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…