టీడీపీ రౌడీ రాజకీయం.. దాడిలో వైసీపీ కార్యకర్త బలి

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నింటిలో టెన్షన్ పెరిగిపోతోంది. నయానో భయానో ఓటర్లను లొంగదీసుకునేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లనే కాదు.. అధికార పార్టీ కార్యకర్తలను సైతం ఏదో ఒక విధంగా లొంగదీసుకునేందుకు చివరకు హత్యా యత్నాలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా పచ్చ గూండాల దాడిలో వైసీపీ కార్యకర్త ఒకరు బలయ్యారు. ఆసుపత్రిలో నిస్తేజంగా పడి ఉన్నాడు. టీడీపీ గూండాలు చేసిన పనికి సదరు కార్యకర్త కుటుంబం తల్లడిల్లుతోంది. 

మంగళగిరిలో ఓటమి తప్పదని తెలిసి.. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తన గూండాలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పొలిటికల్ టెర్రరిస్ట్‌లా దాడులు చేయిస్తున్నారు. నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న మేకా వెంకటరెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరచడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు వెంకటరెడ్డికి చికిత్సను అందిస్తున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా తెలుస్తోంది.  

Advertisement

మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్‌ మండలం కుంచనపల్లిలోని సీఎస్‌ఆర్‌ రోడ్‌లో వైసీపీ నేతలు గురువారం రాత్రి ప్రచారం చేస్తున్నారు. వారిని మద్యం మత్తులో ఉన్న  టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం నిర్వహించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. టీడీపీతో పాటు లోకేష్‌కు అనుకూల నినాదాలు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడగా.. వెంకటరెడ్డి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024