టీడీపీ, జనసేనలతో డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్న బీజేపీ.. ఈ ఘటనే నిదర్శనం..

ఇవాళ ఎన్డీఏ కూటమి పేరిట ఏపీలో మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతలు కలిసి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఆ కార్యక్రమాన్ని చూసిన ప్రజలకు మాత్రం చిన్న సందేహం వచ్చింది. దీనిని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మేనిఫెస్టో అనాలా? లేదంటే టీడీపీ – జనసేన మేనిఫెస్టో అనాలా? అని..

ఎందుకంటే ఈ మేనిఫెస్టో కార్యక్రమంలో బీజేపీ తరుఫున రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారనే కానీ మేనిఫెస్టోను ఆవిష్కరించే సమయంలో ఆయన కనీసం మేనిఫెస్టో కాపీని చేతిలో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. తనకు వద్దంటూ నిరాకరించారు. కనీసం చంద్రబాబు పక్కకు కూడా ఆయన రాలేదు. కాస్త డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేశారు. ఇదంతా చూస్తుంటే అసలు బీజేపీ దీనికి మద్దతు ఇస్తున్నట్టా? ఇవ్వనట్టా? అనే సందేహం ఎవరికైనా వచ్చి తీరుతుంది. అసలే బీజేపీ మొదటి నుంచి కూటమికి దూరంగానే ఉంది.

Advertisement

ఎన్నో సార్లు చంద్రబాబు, పవన్ ఢిల్లీకి వెళ్లిన మీదట కానీ బీజేపీ కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తరువాత కూడా బీజేపీ ఈ రెండు పార్టీలతో అంటీముట్టనట్టుగానే ఉంది. ఏపీ డీజీపీ, సీఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలని టీడీపీ, జనసేన అధినేతలు మొత్తుకుంటున్నా కూడా బీజేపీ పట్టనట్టే వ్యవహరిస్తోంది. ఇదంతా చూస్తుంటే గుర్రాన్ని నీటి వరకూ లాక్కురావొచ్చు కానీ నీళ్లు తాగించలేమనే విషయం గుర్తొస్తోంది. వీళ్లు పట్టుబట్టి బీజేపీని కూటమిలోకి లాక్కొచ్చారు కానీ బీజేపీ మాత్రం అయిష్టంగానే ఉంది. ఈ రెండు పార్టీలతో వీలైనంత డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తోందనడానికి నేటి ఘటనే నిదర్శనం.

Advertisement
Sootiga Team

Recent Posts

ఎన్టీఆర్ లైఫ్‌లో ఎప్పటికీ ఆ లోటు ఉంటుందట.. అదేంటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో…

May 21, 2024

రేవ్ పార్టీలో లేను.. ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా: నటి హేమ

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…

May 20, 2024

కుప్పంలో చంద్రబాబు ఓటమి కన్ఫర్మ్: పెద్దిరెడ్డి

ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…

May 20, 2024

కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు.. పిక్స్ వైరల్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…

May 20, 2024

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…

May 19, 2024

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్‌లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…

May 19, 2024