ఇటీవలి కాలంలో ఎంపీ కేశినేని నాని తన సొంత పార్టీపైకే బాణాలను ఎక్కువగా ఎక్కుపెడుతున్నారు. ఇక అధికార పార్టీపై అయితే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పోనీ అలాగని ఏమైనా పార్టీ మారుతారా? అంటే మారే ఉద్దేశమే లేదని.. కానీ చిర్రెత్తితే మాత్రం ఆలోచిస్తానన్నారు. టీడీపీ ఇన్చార్జులంతా గొట్టంగాళ్లంటూ సంచలనానికి తెరదీశారు. ఎవరో ఏదో తన గురించి ఏదో ప్రచారం చేశారని తాను పట్టించుకోబోనని.. తాను ఏది చేసినా పొగిడే వాళ్లు.. తిట్టేవాళ్లూ ఉంటారన్నారు. తాను ఏం చేస్తాననే విషయమై తనకు స్పష్టత ఉందని కేశినేని నాని స్పష్టం చేశారు. తనకు ప్రజల్లో మంచి పేరు ఉందని.. అందుకే అన్ని పార్టీల్లోనూ తన గురించి చర్చ నడుస్తోందన్నారు.
ప్రజాప్రతినిధిగా గెలిచాక ప్రాంతం, ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని.. ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకున్నా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తానని కేశినేని నాని అన్నారు. విజయవాడ ప్రజలతంతా తనతో కంఫర్ట్గా ఉన్నారన్నారు. తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదని వెల్లడించారు. రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలతో పని లేదంటూ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టిన టీడీపీ ఆఫీస్ ఓపెనింగ్కు సైతం తనకు ఆహ్వానం లేదన్నారు. ఇన్చార్జిల పేరుతో హడావుడి చేసే వాళ్లు గొట్టంగాళ్లని కేశినేని నాని నిందించారు.
మారవా.. నువ్వు మారవా అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా..! ఇంకోటి చెబుతా ఆగండి.. నువ్వు యదవ కాదు అని…
స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ ఒక పోస్ట్ పెట్టి…
ఒక డిఫరెంట్ మేనరిజంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్లో పుష్ప సినిమాను హిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప…
ఏపీ రాజకీయాలు బీభత్సమైన హీట్ను రాజేస్తున్నాయి. ఈసారి అన్నా చెల్లెళ్లు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతుళ్లుగా విడిపోయి మరీ ఒకరిపై…
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఎల్లో మీడియా కుట్రలో భాగమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్ చేసి వెంటనే…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ.. దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఎక్కడ ఈ యాక్ట్తో…