థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయ
ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections 2023) గ్లామర్ డోస్ ఓ రేంజ్లో ఉండేలా కనిపిస్తోంది. హీరో నితిన్ (Nithiin), జీవిత (Jeevitha Rajasekhar), ప్రకాష్ రాజ్ (Prakash Raj), కత్తి కార్తీక (Kathi Karthika) నుంచి దిల్ రాజు (Dil Raju), రామ్ తాళ్లూరి (Ram Talluri), దర్శకుడు శంకర్ (Director Shankar) వంటి వారంతా ఎన్నికల్లో పోటీ చేస్తారనే టాక్ బీభత్సంగా నడుస్తోంది. దిల్ రాజు బీఆర్ఎస్ (BRS) తరుఫున పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే ఇప్పటికే ప్రకాష్ రాజ్.. సీఎం కేసీఆర్ (CM KCR)తో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక నల్లగొండ నుంచి దర్శకుడు శంకర్, జైబోలో సినిమా హీరో రోషన్ బాలు సైతం బీఆర్ఎస్ టికెట్ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక హీరో నితిన్ వచ్చేసి బీజేపీ (BJP) నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ నితిన్ పేరును పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) సైతం ఇప్పటికే నితిన్తో హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఇక విజయశాంతి (Vijayashanthi) బీజేపీలోనే ఎలాగూ ఉండనే ఉన్నారు. ఇక ఈసారి జీవిత (Jeevitha) కూడా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆమె జహీరాబాద్ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే బాబు మోహన్ ఎప్పటిలాగే ఆందోళ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బిగ్బాస్ (Bigg Boss) కంటెస్టెంట్, టీవీ ఆర్టిస్ట్ కత్తి కార్తీక కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దుబ్బాక అసెంబ్లీ టికెట్ను ఆశిస్తున్నట్టు సమాచారం. ఇక ఈసారి జనసేన సైతం తెలంగాణ (Telangana)లో పోటీ చేయనుంది. జనసేన పార్టీ నుంచి ఖమ్మం జిల్లాకు రామ్ తాళ్లూరి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. చుట్టాలబ్బాయి, నేల టికెట్, డిస్కో రాజా తదితర సినిమాలు నిర్మించిన రామ్ తాళ్లూరి.. జనసేన తరఫున ఖమ్మం జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.
‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…
టిల్లు స్క్వేర్తో మళ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్బాస్ షో ఎవరికి…
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…