కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. పటాన్‌చెరు సమీపంలో ఆమె కారుకు ప్రమాదం జరిగింది.  ఓఆర్ఆర్‌పై లాస్య నందిత కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అకాల మరణంతో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయ్యింది. ఈ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నించారు. హైదరాబాద్‌ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఇదే కావడంతో తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో తీవ్రంగా ఆలోచించిన గులాబీ బాస్ అక్కడి టికెట్‌ను సాయన్న కుమార్తె, మాజీ కార్పొరేటర్‌ లాస్య నందితకే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అలా చాలా మందితో పోటీ పడి మరీ కంటోన్మెంట్ టికెట్‌ను దక్కించుకుని లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

ఎమ్మెల్యే సాయన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన హఠాన్మరణంతో ఆయన స్థానంలో లాస్య నందితను బరిలోకి దించాలని సాయన్న అనుచరులు భావించారు. అలా ఒక సాధారణ కార్పొరేటర్ స్థాయిని ఏకంగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాస్య నందిత సరిగ్గా ఏడాది పాటు కూడా తన పదవిని అనుభవించలేకపోయారు. ఇటీవల కేసీఆర్ నల్గొండ సభ సమయంలోనూ ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఇక నేడు డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగా ఆమె మరణించారు.