సానుభూతి.. బాబుకు బెయిల్ తెచ్చింది.. పండగ చేస్కోండి తమ్ముళ్లూ..!

సానుభూతి.. బాబుకు బెయిల్ తెచ్చింది.. పండగ చేస్కోండి తమ్ముళ్లూ..!

అవును.. 52 రోజుల జైలు జీవితం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిలొచ్చింది. ఇన్నేళ్ళుగా వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబు ఇన్నాళ్లకు చట్టానికి చిక్కి, జైల్లో అర్థశతదినోత్సవం చేసుకున్నారు. అనారోగ్యకారణలతో షరతులతో కూడిన బెయిల్ ఇప్పుడు దక్కింది.

తన కేసులు కొట్టేయాలి.. అంటూ పలు స్థాయిల్లోని కోర్టుల ముందు పెట్టుకున్న అర్జీలు ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు అవమానభారం .. ఇంకోవైపు పనికిమాలిన కొడుకు పప్పుతో శిరోభారం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ .. ప్రధానులను, రాష్ట్రపతులు శాస్త్రవేత్తలను తయారుచేశామని చెప్పుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబును ఈ అరెస్ట్ తీవ్రంగా కలవరపరిచింది.

Advertisement

ఇక ఇలా బయటికి వచ్చే అవకాశం లేదని గ్రహించిన చంద్రబాబు ఏకంగా టక్కుటమార విద్యలు బయటపెట్టారు. కళ్ళు బాగా లేవని, చికిత్స అవసరం అని కోర్టులముందు వాపోయారు. దీంతో పోన్లే కళ్ళు కూడా బాలేకపోతే ఎలా అంటూ కోర్టు సానుభూతి బెయిల్ ఇచ్చింది. ఇందులోనూ బోలెడు కండిషన్స్ పెట్టింది.!

అసలేం జరిగింది!!

స్కిల్ స్కాములో దాదాపు రూ. 374 కోట్లను దోచుకుని, పైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ లిక్కర్ స్కాం లో కీలక సూత్రధారిగా ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తిరిగి నవంబర్ 28 న సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది. అరెస్ట్ అయినా నెలన్నర రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆనాటి నుంచీ అనారోగ్యం పేరిట ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. చర్మ సమస్యలు ఉన్నాయని, కంటి సమస్య ఉందని, బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నాయని బెయిల్ కోసం ఇలా పలు అంశాలను విస్తృతంగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోంది.

రోగమొచ్చింది.. బాబుకు బెయిల్ తెచ్చింది.. పండగ చేస్కోండి తమ్ముళ్లూ..!

ఇదీ జగన్ సర్కార్ అంటే..!!

చంద్రబాబు విషయంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవడమే కాకుండా ఎన్నడూ లేనిది ఆయనకు ఎయిర్ కండిషనర్ కూడా ఏర్పాటు చేసింది. అయినా సరే బెయిల్ కోసం ఆయనకు లేని రోగాలను సైతం ఉన్నట్లు చూపించి ఎల్లోమీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్ట్ ఇస్తూ… విధించిన షర

  1. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు…
  2. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు…
  3. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది…
  4. చంద్రబాబు తో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి.
  5. Z+ సెక్యూరిటీ విషయంలో… కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య.

చూశారుగా.. ఇదీ సంగతి చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి బయటికి వచ్చే వరకూ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూస్కుందో.. ఐనా సరే టీడీపీ లేనిపోని ఆరోపణలు, ఆకరికి బయటికి వచ్చాక బాబు కూడా అలానే.. తప్పు చేయలేదు అన్న పరిస్థితీ.