భువనేశ్వరి ఆడియో డీఫేక్ కాదు.. నిజమే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆడియో క్లిక్ రెండ్రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దళితులను అవమానించినట్లు, పచ్చి బూతులు తిడుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. భువనేశ్వరి ఎవర్ని తిట్టారు..? ఎందుకు.. ఏ విషయంలో తిట్టారనే విషయం క్లారిటీ లేదుగానీ.. కులం, జాతి అని ప్రస్తావించడం సిగ్గుచేటు. అదేదో అంటారు కదా గోడకు చెవులు ఉంటాయన్నట్లుగా ఇదంతా చూసిన, విన్న ఓ వ్యక్తి ఆడియోను రిలీజ్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా ఇదంతా సోషల్ మీడియాను పాకేసింది. అబ్బే ఇదంతా డీఫేక్ వీడియో అని టీడీపీ ఎంత కవర్ చేసినా.. భువనేశ్వరి మాత్రం అడ్డంగా బుక్కయ్యింది. అదెలాగంటే.. భువనేశ్వరి బూతుల ఆడియో డీప్ ఫేక్ కాదు అని తేల్చిన కేంద్రానికి చెందిన డీప్ ఫేక్ అనాలిసిస్ యూనిట్ తేల్చేసింది. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. డీప్ ఫేక్ అనాలిసిస్ యూనిట్ గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్య డీ ఫేక్ ఆడియో, వీడియోలు ఎక్కువయ్యాక కేంద్రం పరిధిలో అనాలిసిస్ యూనిట్ ఏర్పాటు అయ్యింది. అప్పటి నుంచి ఇలాంటి ఆడియో, వీడియోలపై పర్యవేక్షిస్తూ ఉంది. ఇప్పుడు భువనేశ్వరీ వంతు రాగా.. ఆమె వాయిస్ తో ఉన్న ఆడియోపై లెక్క తేల్చింది.

ఇంతకీ ఆడియోలో ఏముంది?

లీక్ అయిన ఆడియోలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ జరిగినట్లుగా ఉంది. అవతలి మనిషి ఎవరు అనేది క్లియర్ గా తెలియట్లేదు కానీ.. బాబోయ్ భువనేశ్వరి కాస్త భూతేశ్వరిగా మారిపోయారు. ఆడియోను బట్టి చూస్తే అవతలి వ్యక్తి ఏదో ఎమ్మేల్యే సీటు గురుంచి మాట్లాడారనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ ఆడియో అస్సలు నిజం కాదని.. ఎన్నికల ముందు ఇదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా అని.. కూటమి అఖండ విజయం సాధిస్తుందని తెలిసి ఇలా డీ ఫేక్ ఆడియో, వీడియోలతో హడావుడి షురూ చేసిందని ఎన్నెన్నో మాటలు టీడీపీ నుంచి వచ్చాయి. సీన్ కట్ చేస్తే.. ఆడియో అక్షరాలా నిజమనేని తేలిపోయింది. దీనిపై ఇప్పుడు టీడీపీ ఎలా రియాక్టు అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

ఇప్పుడు ఏమంటారు..?

కాగా.. ఈ ఆడియో మొదట వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జాల భార్గవ్ రెడ్డికి చేరింది. ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆ ఆడియో చూసిన సొంత పార్టీ నేతలే అవాక్కయిన పరిస్థితి. దీంతో సజ్జలను, వైసీపీని టార్గెట్ చేస్తూ పచ్చి బూతులు తిట్టారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అసలు విషయం బయటికి పొక్కడంతో ఒక్కరంటే ఒక్కరూ మీడియా ముందు వచ్చి గానీ.. సోషల్ మీడియాలో కానీ రియాక్ట్ కాకపోవడం గమనార్హం. ఇప్పుడు నెట్టింట్లో ఇదే చర్చ జరుగుతోంది.