అరవయ్యేళ్ళ నాటి కల… వరికపూడిసెలకి రేపు జగన్ శంకుస్థాపన..

అరవయ్యేళ్ళ నాటి కల… వరికపూడిసెలకి రేపు జగన్ శంకుస్థాపన..

ఏపీ ప్రజానీకం ఎంతగానో ఎదురు చూస్తున్న వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి మహర్ధశ పట్టింది. ఇన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన కల ఇప్పుడు సాకారం అవుతోంది. పనులు ఎగ్గొట్టడానికి ఎన్నో దారులు ఉంటాయి. పని చేయాలంటే ఒక్కటే దారి ఉంటుంది. అది కష్టమైనా ఆ దారిలోనే వెళ్లి ఏపీ సీఎం జగన్ వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశం టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. దీంతో అప్పటి పాలకులు దీన్ని బూచిగా చూపి సైలెంట్ అయిపోపయారు. కానీ ఏపీ సీఎం జగన్ పుణ్యమాని ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది.

అరవయ్యేళ్ళ నాటి కల… వరికపూడిసెలకి రేపు జగన్ శంకుస్థాపన..

రూ. 340.26 కోట్లతో ఎత్తిపోతల పథకం తొలి దశ పనులు..

ఈ వరికపూడిసెల ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను రూ. 340.26 కోట్లతో చేపట్టనున్నారు. దీనికి గానూ పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను శరవేగంగా పూర్తి చేసిన అనంతరం అధునాతన పైప్ ఇరిగేషన్ ద్వారా 24,900 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలో మీటర్ల ఎగువన కృష్ణా నదిలో వరికపూడిసెల వాగు కలవడానికి ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తి పోసి పల్నాడు భూములకు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన. అయితే ఈ పనులు టైగర్ రిజర్వ్ ఫారెస్టులో చేపట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది.

24,900 ఎకరాలకు నీళ్లు..

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి మళ్ళీ కదలిక వచ్చింది. దీంతో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో తొలి దశ పనులతో పాటు వరికపూడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు. వరికపూడిసెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 4 కి.మీ.ల పొడవున పైప్ లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ అనుమతులు రావడం ఆలస్యమవడంతో ఇన్నాళ్ళుగా ఈ ప్రాజెక్టు ఆగింది.

అరవయ్యేళ్ళ నాటి కల… వరికపూడిసెలకి రేపు జగన్ శంకుస్థాపన..

ఏప్రిల్ 28న అనుమతి..

ఇప్పుడు ఆ ఫారెస్ట్ భూమికి ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. పలు మార్లు కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపిన తరువాత వరికపూడిసెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైప్ లైన్లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని ఆయకట్టుకు సమర్ధవంతంగా నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం జగన్ మాచర్లలో పర్యటించనున్నారు. అక్కడ వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు.