కొండ కోనల్లోంచి కొలంబియా వర్సిటీకి.. ఏపీ విద్యా సంస్కరణలకు విదేశీయులు ఫిదా !!

కొండ కోనల్లోంచి కొలంబియా వర్సిటీకి.. ఏపీ విద్యా సంస్కరణలకు విదేశీయులు ఫిదా !!

సాధారణంగా పల్లెటూళ్లలోని పిల్లలు ఎలా ఉంటారు? ఎక్కడికీ వెళ్లలేరు. ఎవరితోనూ బిడియం లేకుండా మాట్లాడలేరు. ఒక గిరి గీసుకుని అదే ప్రపంచమని బతికేస్తూ ఉంటారు. కనీసం పెద్దల ఎదుట నిలబడి మాట్లాడటం కూడా కష్టమే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కొండకోనలను వీడి అంతర్జాతీయ వేదికల మీద ఆశీనులవుతున్నారు. పెద్దల ఎదుట మాట్లాడలేని వారు.. పెద్ద పెద్ద ప్రొఫెసర్ల ఎదుట ఏమాత్రం సంశయం లేకుండా ప్రసంగిస్తున్నారు. వీరి ప్రసంగాలకు ఆయా ప్రొఫెసర్లు నోరెళ్లబెడుతున్నారు. తమ స్కూలు స్వరూప స్వభావాలను స్వయంగా తెలియజేస్తున్నారు. తమ విద్యావిధానం గొప్పగా మారిన తీరును బ్రాండ్ అంబాసిడర్లుగా మారి మరీ దేశవిదేశాల్లో ప్రచారం చేస్తున్నారు. పిల్లల ప్రసంగాలను విన్న వారంతా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు గొప్పతనం గురించి తెలుసుకుని అవాక్కవుతున్నారు. అన్ని దేశాలు.. అందరు పాలకులు ఇలాగే చేయాలి.. విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అని విద్యావేత్తలు.. శాస్త్రవేత్తలు..మేధావులు.. ప్రొఫెసర్లు ఏక కంఠంతో అంగీకరించాల్సి వచ్చింది.

కొండ కోనల్లోంచి కొలంబియా వర్సిటీకి.. ఏపీ విద్యా సంస్కరణలకు విదేశీయులు ఫిదా !!

ఐక్యరాజ్యసమితిలో సైతం చర్చ..

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యారంగ సంస్కరణలు, మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయనడంలో సందేహం లేదు. విద్యార్థులకు ట్యాబ్ లు, జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లుతోపాటు గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ వంటివి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకంగా చర్చకు రావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర – అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్‌‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించగా ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరై స్టాల్ పెట్టి మన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు. ఇంకా విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని కాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారు.

కొండ కోనల్లోంచి కొలంబియా వర్సిటీకి.. ఏపీ విద్యా సంస్కరణలకు విదేశీయులు ఫిదా !!

మంత్రముగ్ధులైన ఆహుతులు..

సమాజ మనుగడకు యువత..యువ శక్తే కీలకం. అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చేసిన ప్రసంగం దేశదేశాల అధినేతలు, మంత్రులు, అధికారులను ఆకట్టుకుంది. న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి యువత ఎంత కీలకం అన్నది వివరిస్తూ చెబుతుంటే ఆహూతులంతా మంత్ర ముగ్ధులయ్యారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్ల పిల్లల్లో ఇంత పరిణితి, ఆలోచనా స్థాయి పెంపొందించడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమని అందరూ అంగీకరించాల్సిన పరిస్థితి మన పిల్లలు కల్పించారు. మొత్తానికి ఏపీలో విద్యారంగం సాధించిన ప్రగతి ఇప్పుడు దేశవిదేశాలకు పాకింది.. ఇది..కదా పాలన అని అందరూ అభినందించాల్సింది. కాగా.. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లారు. వీరు అక్కడి వేదికల మీద ప్రముఖుల సమక్షంలో చేసిన ప్రసంగాలు.. తమ ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న కృషిని ఆనందం.. తన్మయత్వంతో కూడిన సంతోషంతో వివరిస్తూ ఉంటే మేధావులు సైతం మంత్ర ముగ్ధులయ్యారు.

కొండ కోనల్లోంచి కొలంబియా వర్సిటీకి.. ఏపీ విద్యా సంస్కరణలకు విదేశీయులు ఫిదా !!

పిల్లల పరిణతి చూసి ముచ్చటపడిన ప్రొ. జెఫ్రీ సాచ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యం, దాన్ని అమలు చేస్తున్న తీరు, పిల్లలు సైతం ఆ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత ప్రమాణాలను ఆకళింపు చేసుకుంటున్న తీరు అభినందనీయమని ప్రఖ్యాత కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ అన్నారు.ఈ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ మన విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యావిధానంలో వచ్చిన మార్పులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తాము ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నదీ, తమకు ప్రభుత్వం ఎంతగా తోడ్పాటును ఇస్తున్నదీ వివరిస్తూ ఉంటే ఆయన అమితానందం పొందారు. 42 గౌరవ డాక్టరేట్లు పొందిన ఈ ప్రొఫెసర్ పిల్లల పరిణితి చూసి ముచ్చట పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలు పాలకులకు మార్గదర్శకం అవుతున్నాయని కొనియాడారు.

కొండ కోనల్లోంచి కొలంబియా వర్సిటీకి.. ఏపీ విద్యా సంస్కరణలకు విదేశీయులు ఫిదా !!
కొండ కోనల్లోంచి కొలంబియా వర్సిటీకి.. ఏపీ విద్యా సంస్కరణలకు విదేశీయులు ఫిదా !!