టీడీపీ, నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఏకమవుతున్న కాపులు..

టీడీపీ, నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఏకమవుతున్న కాపులు..

టీడీపీతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వ్యతిరేకంగా కాపులంతా ఏకమవుతున్నారు. సీఎం అభ్యర్థి గురించి తమను ఎందుకు సంప్రదించలేదంటూ ఏపీలోని కాపు అగ్రనేత ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కాపుల ఆకాంక్షలను పట్టించుకోకుండా సీఎం అభ్యర్థిని ప్రకటించడంపై మాజీ ఎంపీ హరి రామజోగయ్య తాజాగా నారా లోకేష్‌కు మరో లేఖ రాశారు.

‘‘ప్రస్తుతం రాష్ట్రంలో సంభవిస్తున్న సామాజిక పరిజామాలు చూస్తుంటే బాధకలుగుతున్నది. ఈ పరిణామాలు మన కాపు సామాజికవర్గ ఉనికికి ముప్పు తెచ్చేలా మున్ముందు మనల్ని మరింత ఆత్మ రక్షణలో పడేసేలా ఉన్నాయి తప్ప మన కాపులకు ఏమాత్రం మేలు చేసేవిలా లేవు. ఇన్నేళ్ళుగా అన్ని పార్టీలు కాపులను వాడుకుని చివరకు కరివేపాకులా బయటవడేశారు. ఇన్నాళ్లు లెక్కవేరు ఇక నుంచి వేరు. ఇవ్చుడు మరోసారి చంద్రబాబు చేతిలో మోనపోవడానికి కాపులు సిద్ధంగాలేరు’ అన్నారు.

Advertisement
టీడీపీ, నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఏకమవుతున్న కాపులు..

ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిన్తున్నాయి…

వంగవీటి రంగా తర్వాత పెద్ద స్థాయిలో కాపులకు అండగా నిలబడతాడని అనుకున్న వవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు పంచన చేరడం మన సామాజికవర్గానికి అవమానకరంగా ఉంది. కాపుల ఆత్మగౌరవన్ని పవన్‌ కళ్యాణ్ చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాడు. మన సామాజికవర్గానికి పవన్‌ కళ్యాణ్ ఏదో చేస్తాడని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చాము. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేన్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిన్తున్నాయి. పొత్తుతో ఉన్న పార్టీని సంప్రదించకుండా ఐదేళ్లు సీఎం అభ్యర్ధి చంద్రబాబే అని లోకేష్‌ ఎలా ప్రకటిస్తారు.

ఉపేక్షిస్తే లాభం లేదు..

బాబు అనుమతి లేకుండానే లోకేష్‌ ఈ ప్రకటన చేశారా ? కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి బాబు చేన్తున్న కుట్ర ఇది. ఈ విషయమై బహిరంగ లేఖ రాసినా కూడా ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ స్పందించలేదు. కాపులు ఆలోచించుకోవాల్సిన సమయమిది. పవన్ వైఖరి చూస్తుంటే జనసేనను టీడీపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది. మనం ఉపేక్షిస్తే లాభం లేదు. మన గళం విప్పాలి. మన గొంతు వినిపించాలి. మనం పిడికిలి బిగించాలి. మన ఉనికిని కాపాడుకోవాలి. అధికారంలో మన వాటా మనం తీసుకోవాలి’’ అని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.