దయచేసి నా కొడుకు మరణాన్ని రాజకీయం చేయకండి: మహేంద్ర తల్లిదండ్రులు

దయచేసి నా కొడుకు మరణాన్ని రాజకీయం చేయకండి: మహేంద్ర తల్లిదండ్రులు

కొవ్వూరులో దళిత యువకుడు దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మహేంద్ర ఉదంతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని అతని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తెలిసినవెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి, తమ కుటుంబానికి అండగా నిలిచారని వెల్లడించారు.ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

విషయం తెలిసిన వెంటనే కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా తనను సీఎం జగన్ ఆదేశించారని.. మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. మహేంద్ర కుటుంబానికి ఆయన పరామర్శించారు. మహేంద్ర కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించి కూడా ఇస్తామని, ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబం వెన్నంటి ఉన్న జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మహేంద్ర కుటుంబ సభ్యులు వెల్లడించారు. మహేంద్ర ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దయచేసి రాజకీయాలు చేయొద్దని మహేంద్ర కుటుంబ సభ్యులు విజ్క్షప్తి చేశారు.