ఎల్లో ట్రాప్ లో రమేష్… తప్పు పోస్ట్ తో పేరు మటాష్

ఎల్లో ట్రాప్ లో రమేష్... తప్పు పోస్ట్ తో పేరు మటాష్

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఎల్లో మీడియా కుట్రలో భాగమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్ చేసి వెంటనే దిద్దుబాటు చేసుకుని నానా హంగామా చేశారు. ప్రభుత్వం మీద మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసేశారు. మళ్ళీ ఏమైందో ఏమో కానీ దానిని చెరిపేసి.. మళ్ళీ ఏదేదో రాసేసి… ఏదేదో చేద్దాం అనుకుని బొక్కబోర్లా పడ్డారు. పీవీ రమేష్ స్వగ్రామంలో ఉన్న భూమికి మ్యుటేషన్ జరగలేదట. ఈ విషయమై ట్వీట్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. 

తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ..తన ఆవేదన వెళ్లగక్కారు. మళ్లీ వెంటనే దాన్ని సరిదిద్దేసి ఇంకా ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అసలు అమల్లోకి రాకముందే ఇలా జరిగింది అంటూ ఇంకో రెండు పదాలు కలిపి మళ్ళీ ఒక పోస్ట్ చేశారు. దీనిపై కొందరు వెంటనే స్పందించారు. అసలు చట్టమే అమల్లోకి రాకముందు నీకెలా అన్యాయం జరుగుతుందంటూ నిలదీశారు. నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో అయన దగ్గర సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ విషయం అధికారుల దృష్టికి సైతం వెళ్లింది.

Advertisement

కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో పీవీ రమేష్‌కు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఉన్న సమస్య మీద ఆయనకు అధికారులు వివరణ ఇచ్చారు. ఆ భూమిలో పీవీ రమేష్ తో బాటు అయన సోదరులకు కూడా భాగం ఉందట. దీంతో భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వాస్తవానికి  ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ రమేష్ అవేమీ చూపించకుండానే దరఖాస్తు చేశారట. దీంతో ఆ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉండిపోయిందని తహసిల్దార్ స్పష్టం చేశారు. అనవసరంగా ఎల్లో మీడియా ట్రాప్‌లో పడి పరువు పోగొట్టుకున్నారని నెటిజన్లు అంటున్నారు.