‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్స్‌తో మాంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం మహేష్ ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ రూ.80 కోట్లకు అమ్ముడయ్యాయట.

మాంచి పాజిటివ్ ఎనర్జీతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయట. ఈ సినిమాకు తొలుత హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైంది. అయితే ఏమైందో ఏమో కానీ ఆమె తను తీసుకున్న అడ్వాన్స్ డబ్బులను రిటర్న్ చేసి మరీ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆ తరువాత ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారనే ప్రచారం బీభత్సంగా జరుగుతోంది.

Advertisement

అంతేకాదు.. పీఎస్ వినోద్ స్థానంలో ఇప్పటికే రవి కె చంద్రన్‌ను తీసుకున్నారని కూడా సమాచారం. ఇప్పటికే ఇలా సినిమా నుంచి కీలక వ్యక్తులు తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో వచ్చిన ఈ రూమర్ తమన్, నాగవంశీలు కల్పించుకోవడంతో మాయమైంది. ఇప్పుడు మరోసారి హల్‌చల్ చేస్తోంది. తమన్ స్థానంలో ఖుషి ఫేం హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరిలియోలను తీసుకోవాలనుకుంటున్నారట.

ఇవీ చదవండి:

హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌

జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు!

‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..