వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?

వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?

స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన లైవ్‌ కన్సర్ట్‌ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. దీనిలో పాల్గొన్న సమంత ఓ రేంజ్‌లో సందడి చేసింది. అనంతరం సమంత తన తల్లితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. 

అయితే అంతా ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది కాబట్టి చికిత్స కోసం అమెరికా వెళ్లారని అనుకున్నారు. కానీ సామ్ ఈ నెల 20న జరిగిన ‘ఇండియా డే పరేడ్’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిందట. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ కార్యక్రమం తర్వాత శుక్రవారం న్యూయార్క్‌లో ఖుషి ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది.

Advertisement
వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?

కార్యక్రమంలో పాల్గొనడం వింతేముంది? అనుకున్నారా? ఈ కార్యక్రమంలో కాసేపు పాల్గొనడానికి సామ్ రూ.30 లక్షలు తీసుకుందట. ఇదొక విశేషమైతే.. మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. ఈ కార్యక్రమానికి టికెట్ పెట్టారట. పాల్గొనే వారి నుంచి ఈవెంట్ నిర్వాహకులు ఒక్కో టికెట్‌కు రూ.12 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వసూలు చేశారట. రూ.2 లక్షలు చెల్లిస్తే సమంతకు దగ్గరలో కూర్చొనే అవకాశం కల్పించారట. ఇక అంతే క్షణాల్లోనే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. సమంత క్రేజ్ ఆ రేంజ్‌లో ఉంది మరి.

ఇవీ చదవండి:

సర్జరీ కోసం అమెరికా వెళ్లిన శర్వా.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్

మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!

2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?

బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్