గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..

Guntur Kaaram: వామ్మో.. ఈ కాపీ క్యాట్ గోలేంటి? మహేష్ టీజర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్..

అసలే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జోడి అంటేనే ఒక ఫ్లాప్ కాంబినేషన్ అనే టాక్ ఉంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాపై కూడా బీభత్సమైన రూమర్స్ వినవస్తున్నాయి. వీరిద్దరి కాంబో సంగతేమో కానీ నిర్మాతలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయట.

అయితే వీరిద్దరి కాంబోలో సినిమా ఎందుకోగానీ బాగా టైమ్ తీసుకుంటుంది. అతడు మూవీ రెండేళ్లు తీసుకుంటే ఖలేజా మూవీ మూడేళ్లు తీసుకుంది. ఇక ఇప్పుడు గుంటూరు కారం మూవీ కూడా చాలా ఆలస్యమవుతోంది. పూజా హెగ్డేతో కొన్ని సీన్స్ చేయడం మళ్లీ వాటిని డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏకంగా హీరోయిన్ పూజా హెగ్డే ను మార్చి, సెకండ్ హీరోయిన్ శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ చేశారు. కథలో సైతం మార్పులు చేర్పులు చేశారట.

Advertisement
Mahesh Babu in SSMB 28

ఇక అంతకు ముందు కేజీఎఫ్ మూవీ కోసం వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్‌ను తీసుకుని వారి వర్క్ నచ్చలేదని పక్కనబెట్టేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పని తనం నచ్చక ఆయన్ను కూడా తీసేశారని టాక్ నడిచింది. ఆ తరువాత స్వయంగా తమనే వచ్చి తనను తీసేయలేదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి వీటన్నింటి కారణంగా బడ్జెట్ తడిచి మోపెడవుతోందట. అంతేకాకుండా సినిమా విడుదల సంక్రాంతికి కూడా డౌటేనట.

ఇవీ చదవండి:

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7పై కేసు.. దీనిలో నిజమెంత?

అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా

తమన్నా పై ఫైర్ అయిన అల్లు అర్జున్ భార్య

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!