బిగ్‌బాస్ తెలుగు 7.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న నిర్వాహకులు

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

బిగ్‌బాస్ తెలుగు 7 కేవలం 14 మందితో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంత తక్కువ మందితో ప్రారంభమవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మందితో షో మొదలుకాలేదు. 19 లేదంటే 21 మందితో ప్రారంభమయ్యేది. ఈ 14 మందితో 15 వారాలు షో నడవడం అనేది 

Advertisement

చాలా కష్టం. ఈ క్రమంలోనే తాజాగా ఈ షో గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది.

ఈ షోలో నిర్వాహకులు బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారట. త్వరలోనే మరికొందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారనే సమాచారం ఉంది. అసలే ముందు నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన సెలబ్రిటీల్లో కొందరు మిస్ అయ్యారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరి సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళుతున్నారు. వీరిలో సీరియల్ నటి పూజా మూర్తి కూడా ఉన్నారట. 

అలాగే హీరోయిన్ ఫర్జానా, పవన్ సాయి రాజ్ పుత్, ఐశ్వర్య ప్రిన్స్, అంబటి అర్జున్, బోలె షవాలి, యాంకర్ వర్షిణి, యాక్టర్ క్రాంతి, నిఖిల్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ వీక్ నామినేషన్‌లో 8 మంది ఉన్నారు. ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈ క్రమంలోనే ఈ 8 మంది హౌస్‌లోకి వెళితే మొత్తంగా 21 మంది అవుతారు. లెక్క సరిపోతుంది. మరి ఈ ప్రచారం ఎంతమేరకు నిజమవుతుందో చూడాలి.

ఇవీ చదవండి:

నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం

జైలు సెంటిమెంటు పెట్టు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టు..

ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..