ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న నటి విజయలక్ష్మి. 1997లో నాగమండలం చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత పలు కన్నడ చిత్రాల్లో నటించిన విజయలక్ష్మి.. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ మూవీలో చెల్లి క్యారెక్టర్‌లో కనిపించి మెస్మరైజ్ చేసింది. తాజాగా ఆమె .. నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. 

సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ కొన్నేళ్ల క్రితం సంచలనానికి తెరదీసింది. ఈ మేరకు ఫిబ్రవరి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. అదే ఏడాది అతని వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తాజాగా సీమాన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సీమాన్ తనను పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకున్నాడని.. అలాగే బలవంతంగా 7 సార్లు అబార్షన్ కూడా చేయించాడని తెలిసింది. ఆపై తన నగలన్నీ తీసుకుని మోసం చేశాడని తెలిపింది.

Advertisement

ఈ క్రమంలోనే తనను బెదిరిస్తున్నాడంటూ ఇటీవల మరోసారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాన్‌ను విచారణకు పిలిచినా కూడా ఆయన హాజరు కావడం లేదు. మంగళవారం విచారణకు రావాలని సీమాన్‌ను పోలీసులు ఆదేశించారు. మరోవైపు తనకు 7 సార్లు అబార్షన్ చేయించాడన్న విజయలక్ష్మి ఆరోపణలపై ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు.

ఇవీ చదవండి:

ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

అక్కడ అడుగు పెట్టగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: అనుష్క

బిగ్‌బాస్ తెలుగు 7.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న నిర్వాహకులు

నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం

జైలు సెంటిమెంటు పెట్టు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టు..